దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
Published: Saturday October 01, 2022
మేడిపల్లి, సెప్టెంబర్30 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ మెయిన్ రోడ్ లో నెలకొన్న శ్రీ కట్టమైసమ్మ దేవాలయం చైర్మన్ బండారు వెంకటరావు ఆహ్వానం మేరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారి ప్రత్యేక పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, లేతాకుల రఘుపతి రెడ్డి, సూరం శంకర్, జెసిబి రాజు, ఇతర నాయకులు కుమారస్వామి , శ్రీకాంత్, ప్రధాన అర్చకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: