పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Published: Friday September 16, 2022
హైదరాబాద్ 15 సెప్టెంబర్ ప్రజాపాలన: జాతీయ ఇంజనీర్స్ డే 162 సందర్భంగా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
ఎర్రమంజిల్ కాలనీ లోని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో ఇంజనీర్.ఇన్. చీఫ్. ఏ.జి‌.సంజీవరావు ఆద్వర్యంలో బేస్తవారం నాడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో పంచాయతీ రాజ్ మరియు మిషన్ భగీరథ ఇంజనీర్లు రక్త దానం చేశారు. తదుపరి సమావేశం ను ఏర్పాటు చేశారు. సమావేశంలో 
మోక్ష గుండం విశ్వేశ్వరయ్య సేవలను పలువురు కొనియాడారు.ఈ కార్యక్రమంలో 
 చీఫ్ ఇంజనీర్ గజం సీతారాములు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎటిఎంఎ ముజీబ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజీవరెడ్డి మరియు ఇతర ఇంజనీర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.