నేడు, రేపు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహింపబడవు
Published: Friday October 29, 2021
జిల్లా ఇంటర్ నోడల్ అధికారి శంకర్
వికారాబాద్ బ్యూరో 28 అక్టోబర్ ప్రజాపాలన : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన టైమ్ టేబుల్ ప్రకారం శుుక్రవారం, శనివారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించడం జరుగదని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి శంకర్ తెలిపారు. అయితే భౌతిక శాస్త్రం (ఫిజిక్స్), అర్థ శాస్త్రం (ఎకనామిక్స్) మరియు ఒకేషనల్ పరీక్షలు టైమ్ టేబుల్ షెడ్యూల్ ప్రకారం ఈనెల 31వ తేదీ ఆదివారం రోజున, అదేవిధంగా రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ), వాణిజ్య శాస్త్రం (కామర్స్), ఒకేషనల్ పరీక్షలు నవంబర్ 1వ తేదీన నిర్వహించడం జరుగుతుందని దీనిని పరీక్షలు వ్రాసే విద్యార్థులు వారి తల్లి దండ్రులు గమనించాలని అన్నారు
Share this on your social network: