కాంగ్రెస్ పార్టీ లో పలువురి చేరికలు

Published: Monday July 04, 2022

మంచిర్యాల టౌన్, జూలై 03, ప్రజాపాలన : కాంగ్రెస్ పార్టీ లో పలువురి చేరికలు మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డుకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు రవిందర్ రెడ్డి ఆధ్వర్యంలో50 మంది ఆదివారం రోజున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.