బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం

Published: Tuesday February 09, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; రంగారెడ్డి జిల్లాలో ఓబీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమన్నారు రంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు, మీర్ పేట కార్పొరేటర్ పసునూరి భిక్షపతి చారి. జిల్లా బాధ్యతలు చేపట్టాక తొలిసారి మర్యాద పూర్వకంగా మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ ను నాదర్ గుల్ లో కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు సన్మానించుకున్నారు. రాష్ట్రం, జిల్లాలో బీజేపీకి బలమైన అనుకూలమైన వర్గం బీసీలే అన్నారు భిక్షపతి చారి. అందరినీ ఒకే వేదికపైకి తెచ్చి.. భవిష్యత్తులో రాజ్యాధికారం సాధించేందుకు నావంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మీర్ పేట కార్పొరేటర్లు కీసర గోవర్ధన్ రెడ్డి, భీమ్ రాజ్, సోమేశ్, బడంగ్ పేట కార్పొరేటర్ గుడెపు ఇంద్రసేనా, అందెల ఐలయ్య, సహా తోట యట్టారెడ్డి గార్డెన్ యాజమానులు పాల్గొన్నారు.
 
Attachments area