డివిజన్లో కొత్త ట్రాన్స్ ఫారం అమర్చిన కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి

Published: Tuesday October 05, 2021
మేడిపల్లి, అక్టోబర్ 4 (ప్రజాపాలన ప్రతినిధి) : విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ బుద్ధానగర్లో స్థానిక కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి 100kv కొత్త ట్రాన్స్ ఫారంను ఏర్పాటు చేశారు. డివిజన్లో జనావాసాలు పెరగడం వల్ల విద్యుత్ వినియోగం చాల పెరిగింది. విధ్యుత్ వినియోగానికి సప్లయ్ కి  సరిపడా ట్రాన్సఫార్మర్లు లేక ఉన్న కొద్ది ట్రాన్సఫార్మర్ల పై లోడ్ పడి ప్రతిసారి లోఓల్టేజి సమస్యతో కరెంటు ట్రిప్ అయి ఇండ్లలో ఉన్న కరెంటు వస్తువులు కాలిపోతున్నాయి. ఈ సమస్యను కాలనీ వాసులు కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ తక్షణమే స్పందించి అధికారులతో చర్చించి సమస్యకు శాశ్వతంగా పరిష్కారించడానికి రోడ్డు నంబర్ 2 వద్ద గద్దె నిర్మించి100kv కొత్త ట్రాన్స్ ఫారంను ప్రారంభించారు. సమస్య పరిష్కరానికి సహకరించి మున్సిపల్ కార్పొరేషన్ విద్యుత్  అధికారులకు, సిబ్బందికి కార్పొరేటర్ ధన్యవాదాలు తెలియజేశారు.