పుట్టిన రోజున దేవాలయ అభివృద్ధికి లక్ష విరాళం*

Published: Thursday December 22, 2022

చేవెళ్ల,డిసెంబర్21. (ప్రజాపాలన ):-

చేవెళ్ల గ్రామపంచాయతీ
సభ్యురాలు యాదమ్మ నర్సింహ రెడ్డి గార్ల మనుమడు కావడి రియన్ష్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం రూ. 1లక్ష విరాళాన్ని దేవస్థానం ధర్మకర్త శ్రీపాదు పంతులుకు అందజేశారు.
పుట్టినరోజు సందర్భంగా దేవాలయం అభివృద్ధి కోసం మంచి కార్యక్రమం చేపట్టిన రియన్స్ రెడ్డికి స్వామి వారి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని పది కాలాలపాటు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని పూజారులు దీవించారు. అలాగే ప్రతి ఒక్కరు దేవాలయం అభివృద్ధి కొరకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.