డివిజన్ లో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ

Published: Monday May 31, 2021
బాలపూర్, మే 30 ప్రజాపాలన ప్రతినిధి : కరోనా మహమ్మారి వైరస్ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో పారిశుద్ధ కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి  పనిచేస్తున్నారని స్థానిక కార్పొరేటర్ పేర్కొన్నారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెండో డివిజన్ కార్పొరేటర్ జేనిగే పద్మ ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు, నీటి శాఖ కార్మికులకు ఆదివారం నాడు చిరు సన్మానం చేసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె (ఆమె భర్త) మాట్లాడుతూ.... భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా కరోనా ను లెక్కచేయకుండా జాగ్రత్తతో పనిచేస్తున్నాను పారిశుధ్య కార్మికులకు అదేవిధంగా నీటి శాఖ కార్మికులకు చిరు సన్మానం చేసి 25 కిలోల సన్నబియ్యం, మాస్కులు, శానిటేజర్స్, నిత్యావసర సరుకులు ఇచ్చారు. మీ సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామిడి శ్రీకాంత్ రెడ్డి, అంజయ్ యాదవ్, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.