26వ డివిజన్లో డ్రైనేజీ పనులు ప్రారంభోత్సవం

Published: Wednesday March 30, 2022
మేడిపల్లి, మార్చి 29 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ నగర పాలక సంస్థ 26వ డివిజన్లోని శంకర్ నగర్లో డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి సమక్షంలో మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాడుగుల చంద్రారెడ్డి, మనోరంజన్ రెడ్డి, నరేష్ గౌడ్, వెంకటేశం గౌడ్ మల్లం, కో ఆప్షన్ మెంబర్ ఇర్ఫాన్, కాలనీ వాసులు రామ సుబ్బయ్య, ఎం ఎస్ అర్ ఏ శర్మ, శివ కుమార్, ఇస్తరి, బి వి వి ఎస్ నాగరాజు, బుచ్చి బాబు, సంబీరెడ్డి, రమేష్ నాయుడు, శుబాన్, అప్పారావు, తెరాస యూత్ సభ్యులు ప్రభు, కాలనీ మహిళలు మాధవి, లక్ష్మి రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.