యువతకు 'స్వయం ఉపాదే, భరోసా* చేవెళ్ల డిసెంబర్ 12 (ప్రజాపాలన):-

Published: Tuesday December 13, 2022

యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని చేవెళ్ల సర్పంచి బండారు శైలజ ఆగిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి అన్నారు. చేవెళ్ల పట్టణంలోని వికారాబాద్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన చాయ్ బంక్ స్టాల్ ను సోమవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడం ద్వారా మరి కొంతమందికి ఉపాధి కల్పించవచ్చని సూచించారు. యువత ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా తమకాలపై తాము నిలబడేలా స్వయం ఉపాధిని ఎంచుకోవాలని పేర్కొన్నారు.  వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి వ్యాపారంలో రాణించాలని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు అతెల్లి  నరేందర్ రెడ్డి, రమేష్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, కుంచం భాను ప్రకాష్ పాల్గొన్నారు.