రైతు సోదరుల కోసం ధర్నాని విజయవంతం చేయండి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాలి దుర్గ
Published: Wednesday November 30, 2022
బోనకల్ నవంబర్ 30 ప్రజాపాలన ప్రతినిధి: తెలంగాణ పిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆదేశాల మేరకు మధిర నియోజక వర్గ స్థాయి పరిధిలో న తెలంగాణలో రైతు సోదరులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ధరణి , రైతు రుణమాఫీ,రైతు భీమా, పోడు భూములు, ధాన్యం, మిరప, పత్తి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులకు ఉన్న సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరుతూ రైతు సమస్యలపై ధర్నా కార్యక్రమము బుధవారం ఉదయం 10.30ని.లకు మధిర మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు మండల రైతు సోదరులను కోరారు.కావున మధిర నియోజక వర్గ 5 మండలాల రైతులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాము.
Share this on your social network: