*శివసేన రెడ్డిఅరెస్టు పై బగ్గుమన్న కాంగ్రెస్ నాయకులు* *ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చ
*ప్రభుత్వ అసమర్థతోనే పేపర్ లికేజీలు*
*జాతీయ రహదారిపై నిరసన కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం*
*శివసేన రెడ్డి ని విడుదల చేయాలని డిమాండ్*
*చేవెళ్లలో యూత్ కాంగ్రెస్ నాయకులు అరెస్టు*
చేవెళ్ల ఏప్రిల్ 5 (ప్రజా పాలన):-
తెలంగాణ ప్రభుత్వం అసమర్థత పరిపాలన చేతగానితనం వలన వరుసగా రెండు రోజులు 10వ తరగతి పేపర్ లీక్ అవడంపై ప్రశ్నించినందుకు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివశేనా రెడ్డి అక్రమంగా రెస్ట్ కు నిరసనగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు.
బుధవారం చేవెళ్ల మండలకేంద్రంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజపూర్ హైపై నిరసన తెలిపి
కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసారు. తెలంగాణ ప్రభుత్వం అసమర్థత చేతగానితనం వల్లనే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, ఎస్ఎస్సి ప్రశ్నాపత్రం వరుసగా రెండు రోజులు లీక్ అవ్వడం, ప్రభుత్వం వైఫల్యం అని మండిపడ్డారు. విద్యశాఖ మంత్రి ఇలాకాలో మొదట పేపర్ లీక్ కావడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. వెంటనే శివసేన రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నిరసన చేస్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీస్లు అరెస్టు చెసి స్టేషన్ కు తరలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సి సెల్ ఉపాధ్యక్షులు బ్యాగారి శ్రీనివాస్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సుశాంత్,ఉపాధ్యక్షులు తిరుపతి,మండల్ కార్యదర్శి దామోదర్,మండల్ ఉపాధ్యక్షులు జైన్ రామ్ రెడ్డి,యాదగిరి,ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: