కొడంగల్ నుండి తాండూర్ ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టాలి

Published: Friday July 30, 2021
వికారాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు పట్లోళ్ళ సతీష్ రెడ్డి 
వికారాబాద్ బ్యూరో 29 జూలై ప్రజాపాలన : కొడంగల్ నియోజకవర్గం నుండి తాండూర్ వెళ్ళే ప్రధానరోడ్డుకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని వికారాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు పట్లోళ్ళ సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. పోలీసులు ఎన్ని ఆటంకాలు కలిగించిన విజయవంతంగా పాదయాత్రను పూర్తి చేసి తాండూర్ ఆర్డిిిఓ కార్యాలయంలోని అధికారులకు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు రమేష్ మహరాజ్ తెలంగాణ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కృష్ణంరాజు జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు ఆమీర్ అబ్దుల్ల, షబరిరెడ్డి శ్రీను, మీర్జా, అశోక్, సింగర్ నర్సింహ, కృష్ణ బంటు రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి 15 రోజులలో పనులు ప్రారంభించకపోతే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతామని హెచ్చరించారు.