అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే పార్టీ బిజెపి నియోజవర్గ కన్వీనర్ ఏలూరు

Published: Tuesday November 22, 2022
నాగేశ్వరావు మధిర నవంబర్ 21 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రెడ్డి గార్డెన్లో  విలేకరుల సమావేశంలో నియోజవర్గ కన్వీనర్ ఏలూరు నాగేశ్వరావు మాట్లాడుతూ బీజేపీ నాయకులు, నియోజకవర్గం లో తెరాస, కాంగ్రెస్, పార్టీలు, మధిరను అభివృద్ధి చేసాము అని  ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి,మధిర ఎమ్మెల్యేగా  భట్టి విక్రమార్క  మూడుసార్లు గెలిసి చేసిన అభివృద్ధి ఏమిటి?ఎమ్మెల్యేగా గెలవాలని తపన పడుతున్న జడ్పీ  చెర్మన్, లింగాల కమలరాజ్ , మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ 9 ఏళ్ళు మీరు చేసిన అభివృద్ధి ఏమిటీ,?ఈ రెండు పార్టీల నాయకులు సమాధానం చెప్పాలి,నియోజకవర్గం లో ఎర్రుపాలెం బోనకల్లు మధిర మధిర టు వైరా అద్వానంగా ఉన్న రోడ్లు, ఆర్ ఎం బి  రోడ్లులను చుస్తే తెలుస్తుంది మీ అభివృద్ధి,
ఏ గ్రామంలో చుసిన ఇళ్ళులేక, ఉన్న ఇంటీలో రెండు మూడు కుటుంబాలు, ఉండలేక వాళ్ళు పడే బాధ వాళ్ళ వేదన చెప్తున్నది, మీరు చేసిన అభివృద్ధి,
మీకు నిజంగా దళితులపై ప్రేమ ఉంటే, దళితులందరికి, దళిత బందు ఇవ్వండి,
ఒక ఊరిలో సుమారు 100 కుటుంబాలు ఉంటే, ఒకరి లేదా ఇద్దరికీ దళిత బందు ఇస్తే, దళితులందరికి ఇచ్చినట్టా,
మధిర లో ప్రభుత్వ కార్యాలయాలు, పూర్తిగా శిదిలావ్యస్థకు చేరినా కార్యాలయాలను చుస్తే మీ అభివృద్ధి తెలుస్తుంది, నియోజవర్గ పరిధిలో బోనకల్లు ఎర్రుపాలెం మధిర చిరు వ్యాపారస్తులు నిత్యం జీవనాధారం చేసుకుంటే  బతుకుతున్న చిరు వ్యాపారస్తు వారికి మేము అండగా ఉంటామని చెప్తూ వారికి శాశ్వత పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు అధికారం ప్రతిపక్షం ఉన్న నాయకులు నియోజవర్గంలో అనేక సమస్యలతో ఉన్న మేము చేశామని గొప్పలు చెప్పుకోవడం కానీ అభివృద్ధిలో ఎక్కడ ఏమి జరగలేదని బిజెపి నాయకులు తెలిపారు అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో అనేకమందికి ఇళ్లస్థలాలు వారికిచ్చిన స్థలంలోమధిరలో 163 సర్వే లో 10ఏళ్ల క్రితం ఇచ్చినా స్థలంలో ఉన్న పిచ్చి చెట్లులను చుస్తే తెలుస్తుంది, మీ అభివృద్ధి,
దళితులను మోసం చేస్తూ, దళిత ప్రజా ప్రతినిధులుగా ఉన్న, గొప్పలు చెప్పుకుంటున్న నాయకులారా, ఎక్కడ మీ అభివృద్ధి,బీజేపీ నాయకులు దళిత బస్తి సంపర్క్ అభియాన్ లో వివిధ, గ్రామాలల్లో కార్యక్రమాలు చేస్తుంటే, వార్వాలేని తెరాస, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులను కార్యకర్తలను బెదిరిస్తూ, భయపెట్టాలని, చూస్తున్న, తెరాస, కాంగ్రెస్ గుండాలారా, మీకు, మీ ఉడుత ఊపులకు భయపడే పార్టీ కాదు బీజేపీ, మా కార్యకర్తలు, మా నాయకులు ఒక్కరు ఉన్న ఇద్దరు ఉన్న, మీలాంటి వాళ్లకు వంద మందికి సమానం అన్న విషయం మర్చిపోకండి,
మీకు నిజంగా మధిర మీద ప్రేమ ఉంటే, నియోజకవర్గన్ని అభివృద్ధి చేయండి, మమ్ములను బెదిరించాలను చుస్తే, మేము తిరగబడితే మీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకోండి,రానున్న రోజుల్లో మధిర నియోజకవర్గం లో అన్ని గ్రామాలు తిరుగుతూ, ప్రజలను చైతన్యపరుస్తూ మీ అధికార మదన్ని దించే రోజు దగ్గర్లో ఉంది అని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో బీజేపీ మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరావు, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి, పెరుమాళ్ళపల్లి విజయరాజు, బీజేపీ జిల్లా కార్యదర్శి, చిలువేరు సాంబశివరావు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, రామిశెట్టి నాగేశ్వరావు, పట్టణ అధ్యక్షులు, పాపట్ల రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు, కుంచం కృష్ణారావు, కొనా నరసింహారావు, కనపర్తి ప్రకాష్, ఉపధ్యక్షులు, పెరుమాళ్ళపల్లి మెహనరావు, యువమోర్చ, కుక్కల రామ్, శ్యామ్,గరిడేపల్లి వేణు, తదితరులు పాల్గొన్నారు.