పల్లెప్రగతి పనులు పరిశీలన - గ్రామాల్లో మొక్కలు పంపిణీ...

Published: Thursday July 08, 2021
సారంగాపూర్, జులై 07 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండలం పెంబట్ల పోచంపెట్ గ్రామాల్లో పల్లెప్రగతి పనుల్లో భాగంగా ఎంపీపీ కోల జమున ఎంపీడీఓ పుల్లయ్య అభివృద్ధి పనులను పరిశీలించి పర్యవేక్షించారు. గ్రామంలో ప్రతి ఇంటికి 6 మొక్కలను నాటే విధంగా మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం పల్లె ప్రకృతివనం వైకుంఠ ధామం కంపోస్ట్ షెడ్ అభివృద్ధి పనులును  సందర్శించారు. ఈ కార్యక్రమంలో మండల్ స్పెషల్ ఆఫీసర్ బాలే శివాజీ రైతుబందు సమితి కన్వీనర్ కోల శ్రీనివాస్ ఏపీవో రాజేందర్ సర్పంచులు బొడ్డుపల్లి రాజన్న పల్లికొండ రమేష్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.