ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి *అనాధలకు అండగా నిలిచి మరో సారి మానవత్వం చాట

Published: Saturday December 03, 2022

ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన కంబాలపల్లి శ్రావణి, శ్రీజ తమ తల్లిదండ్రులు కోల్పోయి అనాధలుగా జీవిస్తూ, పూట గడపక పస్తులుంటూ, దీనమైన జీవితం గడుపుతున్న విషయాన్ని న్యూస్ పేపర్ ద్వారా తెలుసుకున్న  టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు  శ్రీ *క్యామ మల్లేష్ గారు* ఈ రోజు ఉదయం పోల్కం పల్లి గ్రామానికి వెళ్లి వారిని పరామర్శించి ₹20,000/- రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు, భవిష్యత్ లో వారికి  అన్ని విధాల  అండగా ఉంటానాని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోల్కంపల్లి గ్రామ సర్పంచ్  అండాలు గిరి, ఎంపీటీసీ మంగ రవీందర్, సింగిల్ విండో చేర్మెన్ రాజశేఖర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మండల రైతుబంధు సమితి అధ్యక్షులు మొద్దు అంజిరెడ్డి, కో ఆప్షన్ మెంబర్ షరీఫ్, టి ఆర్ ఎస్ నాయకులు ముజాకిర్, దానయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు,