50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి మందకృష్ణ మాదిగ

Published: Thursday February 18, 2021
అశ్వారావుపేట ప్రజా పాలన: అశ్వరావుపేట మండలంలోని నందిపాడు గ్రామానికి చెందిన పద్దంనాగమణి కుటుంబాన్ని మంగళవారం ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ వికటించి మరణించిన పద్దం నాగమణి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోని రూ 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అలాగే పిల్లల చదువులు ప్రభుత్వమే భరించాలని అన్నారు. ఆమె కుటుంబానికి ఎమ్మార్పీఎస్ అన్ని విధాలా తోడుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు అశ్వారావుపేట మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడునార్లపాటి సుబ్బారావు, నార్లపాటి సత్యం, గాలంకి అశోక్, అంగన్వాడి టీచర్స్ విజయ, అనసూర్య నాయకులు, టీచర్లు, తదితరులు పాల్గొనడం జరిగింది.