ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 10ప్రజాపాలన ప్రతినిధి , *అక్రమ అరెస్టులను ఖండించాలి*

Published: Friday November 11, 2022
ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి. స్థానిక ఇబ్రహీంపట్నం బాస్ స్టాండ్ దగ్గర అక్రమ అరెస్టులను నిరసిస్తూ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్బంగా  జంగయ్య ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మాట్లాడుతూ అర్హులైన పేదలందరికి ఇండ్లస్థలాలు ఇవ్వాలని 18రోజులుగా కందుకూరు లో ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 588లో గల భూమిలో ఇండ్లు లేని పేదలందరు, కందుకూరు సిపిఎం పార్టీ అధ్యర్యంలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసి అర్హులైన పేదలకు ఇవ్వాలని సిపిఎం పార్టీ గా ముందుండి పోరాటం చేసిన సిపిఎం పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గు చేతన్నారు. ఈ ప్రభుత్వం డబుల్ బెదురూమ్ అన్నారు. కాని ఎక్కడ ఇవ్వని పరిస్థితి ఉండన్నారు. పెద ప్రజలు ఇంత ఇంటి జాగా అడిగివారిపై అక్రమంగా అరెస్టు లు చేయాడాన్ని సిపిఎం పార్టీ ఇబ్రహీంపట్నం మండల, మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో ఖండిస్తున్నామన్నారు... ఈ కార్యక్రమం లో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యదర్శి CH. ఎల్లేశ, జిల్లా కమిటీ సభ్యులు G.నర్సింహా, ch. శంకర్,యాదగిరి,విజయ్ జంగయ్య, తరంగ్, శ్రీకాంత్,నర్సింహా,తదితరులు పాల్గొన్నారు.