నవంబర్ 18న కన్హా శాంతివనంలో పంచగవ్య మహాసమ్మేళనం.. హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):

Published: Wednesday November 16, 2022
గోవు ఆధారిత  పంచ గవ్యాల వైద్యం పై ప్రజలలో మక్కువ పెరుగుతుందన్నారు గురూజీ నిరంజన్ వర్మ. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పంచగవ్య డాక్టర్స్
అసోసియేషన్, అఖిల భారత గోసేవ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో  జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ  స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ గారి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా 10 వ పంచగవ్య మహా సమ్మేళనం ను కన్హా శాంతి వనం లో ఈ నెల 18 నుండి 20 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఈ సమావేశం లో దేశవ్యాప్తంగా ఉన్న పంచగవ్య డాక్టర్ లు పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు.ఈ సందర్బంగా అవగాహనా సదస్సు తదనంతరం వాక్ ఫర్ గోమాత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో గురూజీ నిరంజన్ వర్మ,తెలంగాణ రాష్ట్ర పంచగవ్య డాక్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీమతి ఇందుమతి ఉద్దరాజు, మురళీధర్, చంద్రస్వామి, యోగేష్ ప్రభు,జీగ్నేష్,కల్పనా గాయత్రి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.