అంగన్వాడీ కేంద్రాలలో పోషన్ పక్వడా కార్యక్రమం

Published: Wednesday March 29, 2023

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రజాపాలన (ప్రతి నిధి) అశ్వారావుపేట లో ని దొంతికుంట అంగన్వాడీ కేంద్రంలో పోషన్ పక్వడా( పోషణా పక్షం) కార్యక్రమం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు, ఇందులో భాగంగా దొంతికుంట అంగన్వాడీ సెంటర్ లో ఈ రోజు భర్తలు, తండ్రుల (మగవారు ) కు చిరుదాన్యాల మీద అవగాహన కలిగించడం మరియు మిల్లెట్స్ వంటల్లో రాగి జావ తయారు చేసి చూపించడం జరిగింది.గర్భిణీలకు చిన్నపిల్లలకు పోషక ఆహారం అందిచడం పోషక ఆహారం పై అవగాహన కల్పించడం జరిగినది.ఈ కార్యక్రమంలో సెంటర్ పరిధిలో భార్యాభర్తలు, పిల్లల తల్లిదండ్రులు. ఐసిడిఎస్ సిడిపీఒ రోజారాణి,సబ్ సెంటర్ వైద్యులు జయసింధూ, అంగన్వాడీ సూపర్వైజర్ విజయలక్ష్మి, సౌజన్య, పద్మ,వరలక్ష్మి మరియు అంగన్వాడీ టీచర్స్ నాగేశ్వరమ్మ, సరస్వతి పాల్గొన్నారు.