భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి

Published: Thursday April 13, 2023

జన్నారం, ఏప్రిల్ 12, ప్రజాపాలన:  ఈనెల 14న అంబేద్కర్ జయంతి రోజున మంచిర్యాల జిల్లా నస్పూర్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరవుతున్నారని, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోర్లకుండ ప్రభుదాస్ ఆ సభను విజయవంతం చేయాలన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రెస్ మీట్ విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేసిన కుట్రను ప్రజలకు తెలియజేయడానికే ఈ సభ ఏర్పాటు చేస్తున్నమన్నారు. విద్యార్థులు, యువకులు, కార్మికులు ఆత్మబలిదానాల వల్ల సాధించుకున్న తెలంగాణలో నేడు వివిధ రంగాలను ప్రైవేటుపరం చేశారన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగులు లేకుండా చేస్తున్నారన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు అంగట్లో పెట్టి అమ్ముకున్నారని ఆరోపించారు. సింగరేణి కంపెనీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ పరం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ లో జరిగే భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లి విజయవంతం చేయాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఫసివుల్లా, మంచిర్యాల జిల్లా సీనియర్ నాయకులు ముత్యం రాజన్న, పట్టణ అధ్యక్షులు ధూమల రమేష్ , రేండ్లగూడ ఎంపీటీసీ కరుణాకర్, వార్డు మెంబర్ గంగన్న యాదవ్, మండల ప్రచార కార్యదర్శి ఎం డి అజహర్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మామిడిపల్లి ఇందయ్యా, రేండ్ల గూడ గ్రామ అధ్యక్షుడు అల్లం పెద్దయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు సయ్యద్ ఇమ్రాన్,ప్రవీణ్, ప్రశాంత్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు సోహెల్, అజ్మత్  తదితరులు పాల్గొన్నారు.