యస్వంతిక మృతికి కారణమైన సాదిక్ ను వెంటనే ఉరితీయాలి

Published: Tuesday October 19, 2021
జాతీయ కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి ఇంచార్జ్ మద్దెల శ్రీనివాస్
బెల్లంపల్లి, అక్టోబర్ 18, ప్రజాపాలన ప్రతినిధి : ప్రేమిస్తున్నానని నమ్మించి అభం శుభం తెలియని యశ్వంతిక మృతికి కారణమైన సాధిక్ ను తక్షణమే అరెస్టు చేసి ఉరితీయాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి ఇంచార్జ్ మద్దెల శ్రీనివాస్ అన్నారు. సోమవారం నాడు బెల్లంపల్లి పట్టణంలోని కాంటాక్ట్ చౌరస్తాలో యశ్వంత్ ఇక మృతికి నిరసనగా ధర్నా  నిర్వహించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణ రామ్ నగర్ కు చెందిన యస్వంతిక మృతికి కారణమైన వ్యక్తి సాదిక్ ను తక్షణమే అరెస్టు చేసి క్రిమినల్, కేసులు పెట్టి ఉరితీయాలని.అంతేకాకుండా మహిళలపై ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత పోలీసులపైన ఉందన్నారు. యశ్వంతిక దళిత అమ్మాయి అయినందుకే పోలీస్ వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదని ఇది  చాలా సిగ్గు చేటని అన్నారు. చనిపోయిన అమ్మాయి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుమ్మిడి గోపాల్, టౌన్ ప్రెసిడెంట్ నందిని, యూత్ ప్రెసిడెంట్ పవన్, అఖిలపక్షం నాయకులు, సూరిబాబు, జయరాం, మేకల శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లి సాగర్, యూత్ కాంగ్రెస్ హరీష్, తేదేపా నాయకులు, బి ఎస్ పి నాయకులు బొస్, వైస్సార్ టీపీ కాసి సతీష్, సీపీఐ ఎం ఎల్ రెడ్ స్టార్ నాయకులు మరియు యస్వంతిక కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.