ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 24ప్రజాపాలన ప్రతినిధి *శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన

Published: Saturday February 25, 2023

హయత్ నగర్ డివిజన్లోని హై కోర్ట్ కాలనీ శ్రీ వరసిద్ధి  వినాయక స్వామి దేవస్థానము యాగశాల ప్రారంభోత్సవంలో  ముఖ్య అతిథిగా స్థానిక డివిజన్ కార్పొరేటర్  కళ్లెం నవ జీవన్ రెడ్డి  సతీ సమేతంగా... పాల్గొన్నారు.  అనంతరం  అర్చకులు వారిని పూర్ణకుంభంతో  స్వాగతం పలికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రకు నిలువెత్తు  సాక్షాలు  ఆలయాలని, లోక కళ్యాణం కోసం  యాగాలు యజ్ఞాలు  అని అయన అన్నారు. ఆలయాల చరిత్ర  భవిష్యత్ తరాలకు అందించాలని. ఆలయ అభివృద్ధికీ తన వంతు సహాయ సహకారాలు  అందిస్తానన్నారు . అనంతరం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కార్పోరేటర్ గారిని  ఘనంగా సన్మానించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో భాజపా డివిజన్ కార్యదర్శి గోవింద చారి  నాయకులు ఎర్రవెలి సత్యనారాయణ గారు, ఆలయ ఫౌండర్ & చైర్మన్  శ్రీనివాస్  , ఆలయ కమిటీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, కార్యదర్శి నాగరాజు  , మరియు ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణమూర్తి  , ప్రసాద్ రావు  , మురళీకృష్ణ  , సింహా రెడ్డి  , రంగారావు,  మోహన్ రెడ్డి , సూర్య ప్రకాష్  , ఏ వి ఆర్   రెడ్డి  , చంద్రశేఖర్  ,  ఉమామహేశ్వర్  కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.