మంచినీటి సమస్య తీరాలని మంత్రికి వినతి
Published: Thursday June 10, 2021
బాలపూర్, జూన్ 09 (ప్రజాపాలన ప్రతినిధి) : విజ్ఞానపురి కాలనీ లో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉందని కార్పొరేషన్ కార్పొరేటర్ పెండ్యాల శివ పార్వతి (భర్త) మంత్రికి వినతి పత్రాన్ని ఇచ్చారు. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ కార్పొరేటర్ పెండ్యాల శివ పార్వతి భర్త పెండ్యాల నరసింహ్మ కాలనీ వాసులతో కలిసి విజ్ఞానపురి కాలనీ లో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉందని మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ భర్త మాట్లాడుతూ.... విజ్ఞానపురి కాలనీ లో మంచి నీటి సమస్య తీరాలంటే 45 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించి కాలనీలో ఉన్న నీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గడ్డం మంగా రెడ్డి, కాలనీ జనరల్ సెక్రెటరీ నరసింహారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ భూపాల్ రెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: