ఘనంగా గంగా దేవి విగ్రహ ప్రతిష్టాపన

Published: Saturday May 21, 2022
మంచిర్యాల బ్యూరో, మే20, ప్రజాపాలన:
 
పాత మంచిర్యాల గోదావరి  ఒడ్డున గత మూడు రోజులుగా గంగాదేవి  ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా శుక్రవారం గంగా దేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షులు నే న్నెల నరసయ్య మాట్లాడుతూ తమ కులదైవమైన అటువంటి గంగాదేవి నీ ప్రతిష్టించడం చాలా సంతోష కరమైన విషయం అని ఇదే ఐక్యత తోటి గంగపుత్రుల అందరూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. 
ఆదివారం నిర్వహించే బోనాల పండుగను గంగ పుత్రులు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసన సభ్యులు నడిపల్లి దివాకర్ రావు మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ గంగపుత్ర సంఘం పట్టణ అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ యువజన అధ్యక్షులు మo చర్ల సదానందం,  చందు , తిరుపతి, రవీందర్, రాజశేఖర్, గుమ్ముల శ్రీనివాస్, గట్టయ్య, గుమ్ముల రమేష్ తదితరులు భక్తులు పాల్గొన్నారు.