బీజేపీ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసిన - ఎమ్మెల్యే సంజయ్ కుమార్,జడ్పీ చైర్ పర్సన్ వసంత

Published: Saturday March 04, 2023
జగిత్యాల, మర్చి 03 (ప్రజపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం పెంచిన సిలెండర్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ తహశీల్ చౌరస్తాలో ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ అద్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సిలిండర్ ధరలను పెంచి కేంద్రం ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తోందని జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఆవేదన వ్యక్తం చేశారు. వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపిన కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిరసనగా డర్న్  చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో సిలిండర్ ధర 50 రూపాయలు పెంచినప్పుడు రోడ్డెక్కి ధర్నా చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇప్పుడు 750 రూ. పెంచినందుకు మహిళలు ఆందోళన చేస్తుంటే ఎక్కడున్నారని నిలదీశారు. మోదీ అసమర్థ పాలనలో తిరిగి కట్టెల పొయ్యిలపై వండుకునే రోజులు దగ్గరున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయం ఛైర్మన్ డా: చంద్రశేఖర్ గౌడ్ జడ్పీటీసీ సంగెపు మహేష్ ఎంపీపీ రాజేంద్రప్రసాద్
మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ నక్క రవీందర్ రెడ్డి బాలముకుందం సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు మహిళ  నాయకురాళ్లు బి.ఆర్.ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.