కాంగ్రెస్ పార్టీ పోలింగ్ బూత్ ఎన్రోల్మెంట్ల నియామకం

Published: Wednesday December 01, 2021

కోరుట్ల, నవంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలంలోని జోగన్ పల్లి గ్రామం లో కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగారావు ఆదేశానుసారం కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంతం రాజం అధ్వర్యంలో పోలింగ్ బూత్ ఎన్రోల్మెంట్ గా పోతవేని శేఖర్ గౌడ్, సైదు గంగాధర్ లను నిమమించారు. ఈ సందర్భంగా కొంత రాజా మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రక్రియ పోలింగ్ బూత్ ఎన్రోల్మెంట్ లు వేగవంతం చేస్తూ ,రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు.మరియు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొన్న ప్రతి కార్యకర్త ప్రయోజనాల దృష్ట్యా అధిష్టానం 2 లక్షల ప్రమాద భీమా ప్రకటించడం హర్షణీయం,పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఆహర్నిసలు కష్టపడలని కోరారు. ఈ కార్యక్రమం లో మాజీ ఏఏంసీ చైర్మన్ సత్యం రావు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరిమల్ల సత్యనారాయణ, నియోజక వర్గ యూత్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు బిటుకు సహదేవ్, బూర్గుల శ్రీహరి, లక్ష్మరెడ్డి, మోహన్ రెడ్డి, రమేష్, గంగాధర్, శ్రీను, రమేష్, గంగచారి, సతీష్, రాజేశం, తధిదరులు పాల్గోన్నారు.