పిడిఎస్ బియ్యం పట్టివేత

Published: Tuesday May 18, 2021
రాయికల్, మే 17,(ప్రజాపాలన ప్రతినిధి) : రాయికల్ పట్టణంలో అక్రమంగా ఒమిని వ్యాన్లో తరలిస్తున్న పది క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని సోమవారం రాయికల్ ఎస్సై ఆరోగ్యం పట్టుకుని కేసునమోదు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇట్టి బియ్యాన్ని తరలిస్తున్న రాయికల్ కు చెందిన జిల్లా శ్రీనివాస్ మరియు ఆర్మూర్ కు చెందిన పద్మ రంజిత్ కుమార్ లపై కేసు నమోదు చేశామని ఎవరైనా పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించినచో ఊరుకునేది లేదని కేసునమోదు చేస్తామని హెచ్చరించారు. ఎస్సై వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.