విద్యుత్ సర్క్యూట్ తో ట్రాక్టర్ దగ్ధం

Published: Friday June 11, 2021
తక్షణమే స్పందించిన సర్పంచ్...
పరిగి, జూన్ 10, ప్రజాపాలన ప్రతినిధి : విద్యుత్ సర్క్యూట్ తో ట్రాక్టర్ దగ్ధమైన సంఘటన వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నస్కల్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ లింగన్ పల్లి గ్రామం నుంచి గడ్డి తీసుకుని వస్తుండగా దోమ అంబేద్కర్ చౌరస్తాలో విద్యుత్ తీగలు తగిలి గురువారం మధ్యాహం ట్రాక్టర్ పై గడ్డి కి నిప్పు అంటుకోవడం జరిగింది. దీంతో జనం భయబ్రాంతులకు గురయ్యారు. ప్రమాదస్థలం జనసoచారం కలది కావడంతో అంతలోనే సమాచారం అందుకున్న సర్పంచ్ కె రాజిరెడ్డి తక్షణమే స్పందించారు. ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చి పక్కలో ఉన్న యజమానుల సహకారం తో బోర్ నుంచి ఫైర్ ఇంజన్ వచ్చే వరకు మంటలను అదుపు చేయించారు. ఫైర్ ఇంజన్ రావడం ఆలస్యం కావడంతో జేసీబీ ని పిలిపించి ట్రాక్టర్ పైనా మండుతున్న గడ్డి ని అర్పుతూ జేసీబీ సహాయం తో గడ్డిని కిందకు వేయించి అనంతరం పూర్తిగా చల్లారాక మళ్ళీ పంచాయతీ సిబ్బందితో వాటర్ టాంకర్ తో క్లీన్ చేయించారు. సహాయక కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్ వార్డ్ సభ్యులు తెరాస నాయకులు యువకులు అందరు పాల్గొన్నారు