సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలిమధిర రూరల్

Published: Monday December 05, 2022

డిసెంబర్ 4 (ప్రజాపాలన ప్రతినిధి) స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని సినీ నటుడు సుమన్ అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని కోరారు. ఆదివారం రెడ్డి గార్డెన్ కళ్యాణ మండపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేఎస్ఎన్ ఫౌండేషన్ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన ఫౌండేషన్ అనాధలను అభాగ్యులను పేదలను ఆదరించేందుకు కృషి చేయాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు సేవే లక్ష్యంగా పనిచేయాలని వారు సూచించారు. సేవ చేయటంలో ఎంతో సంతృప్తి ఉంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు అనంతరం ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేసిన లంక కొండయ్య ను అభినందనలు హెచ్ఐవి ఎయిడ్స్ బుల్ టెన్ సుమను కే సి జి ఫౌండేషన్ చైర్మన్ కోన నరసరావు చేతుల మీదుగా ఆవిష్కరణ చేసి కరపత్రాలు విడుదల చేశారు. జిల్లాలోనే మంచి స్వచ్ఛంద సేవ సంస్థగా కేఎస్ఎన్ ఫౌండేషన్ గుర్తింపు సాధించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మధిర ప్రముఖ వ్యాపారవేత్త కోన జనార్దన్ రావు మధిర సేవా సమితి అధ్యక్షులు పల్లబోతు ప్రసాదరావు కేఎస్ఎన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోన నరసింహారావు కాంగ్రెస్ నాయకులు బిజెపి నాయకులు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు  తదితరులు పాల్గొన్నారు