జిల్లా అభివృద్ధికి అందరం సమిష్టిగా కృషి చేద్దాం ** జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవ్ రావ

Published: Tuesday February 14, 2023
అసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 13 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా అభివృద్ధికి అందరం సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవ్ రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా నూతన కలెక్టర్ గా బదిలీపై వచ్చిన బొర్కడే హేమంత్ సహదేవ్ రావు ను జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయి, ఎస్పి. సురేష్, కుమార్, జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి అందరం సమిష్టిగా కృషి చేద్దామని తెలిపారు.  అనంతరం కలెక్టరేట్ భవన సముదాయంలోని ధరణి కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆర్ డి ఓ కార్యాలయంలో పోడు పట్టాల కొరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు సలహాలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రమేష్, ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్, డిఐఓ.శ్రీధర్ సుమన్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మణెమ్మ, జిల్లా అధికారులు సురేందర్, కృష్ణమూర్తి, సురేష్, గుణవంత్ రావు, అదనపు ఎస్పి. లు అచ్చేశ్వర్ రావు, భీమ్ రావు, డిఎస్పి ,శ్రీనివాస్, జిల్లా ఎక్సైజ్ జ్యోతి కిరణ్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, తహసిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి తదితరులు పాల్గొన్నారు.