పాత ఏరియా ఆసుపత్రిలోని ఓ. పి. ల్యాబ్, ఫార్మసీలను కొత్త ఏరియా ఆసుపత్రికి తరలించాలి : జిల్లా కలె

Published: Monday April 26, 2021
వికారాబాద్ జిల్లా, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : పాత ఏరియా ఆస్పత్రి లోని ఓ పి లాబ్ ఫార్మసీ లను కొత్త ఏరియా ఆస్పత్రికి తరలించాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు వైద్యాధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ పాత మరియు కొత్త ఏరియా ఆసుపత్రులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ వైద్య అధికారులతో మాట్లాడుతూ పాత ఏరియా ఆసుపత్రిలోని ఓ.పి.ల్యాబ్, ఫార్మసీ లను కొత్త ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కోవిడ్ టెస్టింగ్ ఇతర విభాగాలు అన్ని అక్కడికే తరలించాలని సూచించారు. ప్రసూతి విభాగం తప్ప అన్ని విభాగాలు ఎస్ఏపీ కళాశాల వద్ద నిర్మించిన నూతన ఆసుపత్రికి ఆదేశాలు అందిన వెంటనే తరలించేందుకు సిద్ధం కావాలని ఆదేశించారు. మే 1 నుండి ప్రతి ఒక్కరికి కోవిడ్ వాక్సిన్ అందె విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోనాలని వైద్య అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి సుధాకర్ షిండే, డాక్టర్ అరవింద్, డాక్టర్ రమ్యశ్రీ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు