ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Saturday May 21, 2022
బెల్లంపల్లి మే 20 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి నియోజకవర్గం లోని  కాసిపేట మండలం ముత్యంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని   బెల్లంపల్లి ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య, శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల పనితీరును, సిబ్బంది హాజరు తీరును  ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రతి వ్యక్తికి, వీలైనంత వరకు చికిత్స అందించాలని, సరైన  మందులను సరిపడ  ఇవ్వాలని, ఆస్పత్రి సిబ్బంది సమయపాలన పాటిస్తూ, వివిధ రకాల చికిత్సల కోసం వచ్చే పేషెంట్లకు అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చంద్రయ్య , వైస్ ఎంపీపీ విక్రమ్ రావు , ఎంపీటీసీ రాంచందర్ , ముత్యంపల్లి ఉపసర్పంచ్ తిరుపతి , ముత్యంపల్లి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సత్యం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాసుదేవ్ , బెల్లంపల్లి పట్టణ  పార్టీ ప్రధాన కార్యదర్శి రేవెల్లి విజయ్ కుమార్ , ఇతర ప్రజాప్రతినిధులు,  నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు .