హైదరాబాద్ 26 అక్టోబర్ ప్రజాపాలన: ఖేడ్ నియోజకవర్గం లో పలు అభివృద్ధి పనులను తనిఖీ చేసిన పంచాయతీ
Published: Thursday October 27, 2022
బుధవారం నాడు సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గ పరిధిలో ప్రగతి లో ఉన్న పలు అభివృద్ధి పనులను పిఆర్ మెదక్ రీజియన్ ఎస్. ఇ. పి.జోగారెడ్డి తనిఖీ చేశారు. బిటి మరమ్మతు పనులు ఎం.ఆర్.ఆర్. నిధుల కింద మంజూరైనవి, మన ఊరు మన బడి మరమ్మతు పనులు, పిఎంజిఎస్.వై. నూతన రోడ్డు పనులను తనిఖీ చేశారు. ఆందోల్ పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నారాయణ్ ఖేడ్ డిఇ దుర్గా ప్రసాద్, సంబంధిత ఎఇ లు డి.బాల లింగం, సి.హెచ్. రాకేష్ కుమార్, జి.మాధవ నాయుడు , సంబంధిత కాంట్రాక్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: