తుమ్మలను కలిసిన కూచిపూడి వెంకటేశ్వరరావు..

Published: Monday January 02, 2023
తల్లాడ, జనవరి 1 (ప్రజాపాలన న్యూస్): 
 
 రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆదివారం తెలుగుదేశం పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు కలిశారు. నూతన సంవత్సరం సందర్భంగా తుమ్మల ఖమ్మంలో అనుచరులకు విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కూచిపూడి హాజరై మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుమ్మల ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసం పనిచేస్తారన్నారు. ఈ సంవత్సరంలో తమ పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో ఆయన వెంట తల్లాడ నాయకులు నున్నా శ్రీనివాసరావు ఉన్నారు.