కాంగ్రెస్ పార్టీలో భారీ చేరిక

Published: Wednesday September 21, 2022
చౌటుప్పల్, సెప్టెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి):- 
చౌటుప్పల్ మండలం కైతాపురం గ్రామంలో కేంద్ర రాష్ట్ర మొండి వైఖరిని నిరసిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్ని 8 సంవత్సరాలు నుండి ప్రజలకు చేసింది ఏమీ లేదని అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నీ కష్టపడి గెలిపిస్తే ఒక్కనాడు కూడా కైతపురం గ్రామాన్ని సందర్శించలేదని ఆయన కైతపురం గ్రామానికి చేసింది ఏం లేదని ఆయన పార్టీ నుండి వెళ్లినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదని కార్యకర్తలు అందరూ అలాగే ఉన్నారని గ్రామ శాఖ అధ్యక్షుడు తగరం నాగరాజు మాట్లాడారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అని అన్నారు ఆ గ్రామంలోని వివిధ పార్టీల నుండి పెద్దలు ముఖ్యంగా యువకులు మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆధ్వర్యంలో సుమారు 20 మంది యువకులు పార్టీలో చేరారు చేరిన వారిలో గోపానబోయిన మధు గోపనబోయిన రవి గోపి అనిల్ ముద్దం తరుణ్ జి శ్రీనివాస్ గోపనబోయిన మహేష్ తగరం చింటూ తగరం జంగయ్య వెంకటేష్ పిల్లి దినేష్ గోపనబోయిన కృష్ణయ్య గోపి శ్రీలత పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు తగరం నాగరాజు మాజీ సర్పంచ్ గోపి సుధాకర్ గోపి మహేష్ పిల్లి శీను గోపబోయిన రాములు యాదయ్య చింటూ శ్రీశైలం పిల్లి శీను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు