బెల్లం పెల్లి ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించండి : ఆర్డిఓ కి వినతి అంజేసిన జర్నలిస్టులు

Published: Friday October 08, 2021
బెల్లంపల్లి అక్టోబర్ 07 ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి పట్టణంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం కేటాయించాలని బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు గురువారం నాడు స్థానిక ఆర్డిఓ శ్యామలదేవికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ వివిధ పత్రికల్లో మరియు న్యూస్ ఛానల్లలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నామని, బెల్లంపల్లిలో ప్రెస్ క్లబ్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. దానిని గుర్తించి మేము నూతనంగా ఇటీవల ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నామని, కానీ ప్రెస్ క్లబ్ కి సొంత భవనం లేకపోవడంతో కార్యాలయాన్ని అద్దె గదిలో కొనసాగిస్తు న్నామని అన్నారు. అద్దె గది కావడంతో ప్రతి నెల అద్దె చెల్లించడానికి మాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఇందుకు ప్రెస్ క్లబ్ కోసం స్థలాన్ని కేటాయించాలని ఆర్డిఓ శ్యామలదేవికి వినతిపత్రం అందజేయడం జరిగిందని వారన్నారు, ఆర్డిఓ శ్యామల దేవి సానుకూలంగా స్పందించి ప్రెస్ క్లబ్ కోసం స్థలం కేటాయించే విధంగా చూస్తామని గ్రూపు లేకుండా బెల్లం పెట్టే బెల్లంపల్లి పట్టణ జర్నలిస్టులు అందరూ ఒకే తాటిపైకి వచ్చి పని చేస్తే తే స్థలాన్ని కేటాయించడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కృష్ణ, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కోశాధికారి శివ, ఉపాధ్యక్షులు సదానందం, డి.భాస్కర్, ఇరుకుల్ల రమేష్, సహాయ కార్యదర్శి రాజశేఖర్, ప్రచార కార్యదర్శలు నాగరాజ్, నవీన్, మనోజ్ పాండే, కార్యవర్గ సభ్యులు, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.