ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఆదర్శ కమ్యూనిస్టు పుచ్చలపల్లి: ప్రజా సంఘాల నాయకులు

Published: Friday May 20, 2022

బోనకల్, మే 19 ప్రజా పాలన ప్రతినిధి: దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు పార్టీ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతిని రావినూతల గ్రామంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, సిపిఎం మండల కమిటీ సభ్యులు గుగులోతు పంతులు మాట్లాడుతూ పేదల పక్షపాతి, నిరాడంబరుడు, ఉత్తమ పార్లమెంటరియన్గా సైకిల్ పై పార్లమెంట్ కు వెళ్లి ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతిపక్ష నాయకులను సైతం ఒప్పించి సమస్యల పరిష్కారానికి కృషిచేసిన ఆదర్శ కమ్యూనిస్టు సుందరయ్య అని వారి సేవలను కొనియాడారు.నేటి తరం సుందరయ్య ఆశయాలను, ఆదర్శాలను పుణికి పుచ్చుకొని ప్రజా సమస్యల పరిష్కారానికై అలుపెరుగని పోరాటాలు చేయాలని ప్రజా సంఘాలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రావినూతల గ్రామ ఎంపిటిసి కందిమళ్ళరాధ, ఉప సర్పంచ్ బోయినపల్లి కొండ, రెండవ శాఖ కార్యదర్శి కొంగర గోపి, ఒకటో శాఖ కార్యదర్శి మందావీరభద్రం, మాజీ ఎంపీటీసీ తాళ్లూరి బాబు, మాజీ ఎంపీటీసీ గండు సైదులు, రైతు సంఘం నాయకులు జోనిబోయిన గురవయ్య, దొండపాటి సత్యనారాయణ, ఎర్రగాని నాగరాజు ,కొమ్మినేని పిచ్చయ్య, తాటికొండ వెంకటేశ్వర్లు, గీత కార్మిక సంఘం నాయకులు బోయినపల్లి చిన్న వెంకయ్య, మిరియాల సత్యం, ఆవాజ్ నాయకులు షేక్ నాగుల్ మీరా, షేక్ పెద్ద నాగుల్ మీరా, గిరిజన సంఘం నాయకులు ఆజ్మీరా గోపి, భూక్య కృష్ణ, భానోత్ నాగేశ్వరావు,.లాపూరి హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.