సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

Published: Friday November 25, 2022
చౌటుప్పల్, నవంబర్ 24 (ప్రజాపాలన ప్రతినిధి) మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సిఫ్ఫార్స్ తో చౌటుప్పల్ కు చెందిన కల్లూరి అనుదీపిక S/o స్వామికి 4,00,000/- (నాలుగు లక్షల రూపాయలు) విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన నివాసంలో లబ్ధిదారునికి అందజేశారు. లబ్ధిదారుడు సీఎం కేసీఆర్ కి, ఎమ్మెల్యే కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం జడ్పిటిసి భానుమతి వెంకటేష్ గౌడ్, చౌటుప్పల్ మండల పార్టీ అధ్యక్షుడు నిరంజన్ గౌడ్, చౌటుప్పల్ టౌన్ ప్రెసిడెంట్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి, కల్లూరు వెంకటేశం, చెరుకు వెంకటేశం పాల్గొన్నారు...