అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ లకు నివాళులర్పించిన వివేక్ వెంకటస్వామి

Published: Monday April 25, 2022
బెల్లంపల్లి ఏప్రిల్ 24 ప్రజాపాలన ప్రతినిధి : ఆది వారం నాడుబెల్లంపల్లి పట్టణానికి విచ్చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, వివేక్ వెంకటస్వామి  బెల్లంపల్లి లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, విగ్రహాలకు పూలమాలవేసి మహనీయులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్, అందుగుల శ్రీనివాస్, సబ్బని రాజనర్సు, జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా ఎస్ సి మోర్చా ఉపాధ్యక్షులు, ఎరుకల శ్రీనివాస్,  ఎరుకల నర్సింగ్, యాదగిరి, మేకల రాజశేఖర్, ముత్తునూరి నాగరాజు, పట్టణ కార్యదర్శి బాల్మీకి సునీల్, పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పీక లక్ష్మణ్, బి సి మోర్చా పట్టణ అధ్యక్షులు యుగంధర్, తాడవేన రవి, భానుచందర్, శ్రీకాంత్, శ్రీనివాస్, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.