ప్రాథమిక వ్యవసాయ సహకార మార్కెట్ కమిటీ నూతన వైస్ చైర్మన్ కు సన్మానం.

Published: Monday August 22, 2022

జన్నారం, ఆగస్టు 21, ప్రజాపాలన:

 

 

ప్రాథమిక వ్యవసాయ సహకార మార్కెట్ కమిటీ నూతన వైస్ చైర్మన్ కిష్టాపూర్ గ్రామానికి చెందిన గోట్లా రాజేష్ యాదవ్ ను తోటి స్నేహితులు బాలుర ఉన్నత పాఠశాలలో 1998-99 సంవత్సరంలో కలసి చదివిన పదవ తరగతి బృందం సన్మానించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాలుర ఉన్నత పాఠశాలలో ఎర్పాటు చేసిన సమావేశంలో స్నేహితులు మాట్లాడుతూ మును ముందు ఉన్నత పదవులు పోందలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్కెట్ వ్యవస్థ మరింత బలోపేతం అయ్యిందని వైస్ చైర్మన్ అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం గోట్లా రాజేష్ యాదవ్ లను మంచిర్యాల జిల్లా ఏ.డి గజానంద్ ప్రమాణ స్వీకారం చేయించారని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 1998-99 తరగతి బృందం స్నేహితులు, శ్రీధర్, శ్రీనివాస్, శివరాం, లచ్చన్న, రాజు రౌగు,రాజన్న, రమేష్, వెంకటేష్,బకృద్దీన్, తదితరులు పాల్గొన్నారు