ప్రజల ఆరోగ్య సంరక్షణే సీఎం సహాయ నిధి
Published: Thursday January 20, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 19 జనవరి ప్రజాపాలన : ప్రజల ఆరోగ్య సంరక్షణకే సిఎం సహాయ నిధి తోడ్పడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలు మరియు మున్సిపల్ కు చెందిన 23 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో సీఎం సహాయనిధి ఎంతగానో తోడ్పాటును అందిస్తుందన్నారు. అనారోగ్యానికి గురైన పేద ప్రజలకు కొండంత ఆర్థిక అండగా ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాదిరీగ శ్రీకాంత్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు పడమటి శ్రీనివాస్, రైతుబంధు అధ్యక్షుడు నాయబ్ గౌడ్, టిఆర్ఎస్ ఉపాధ్యక్షుడు దేవరదేశి అశోక్, ప్రధాన కార్యదర్శులు బోయిని మధు ముదిరాజ్, కోటమర్పల్లి రాచయ్య, మర్పల్లి ఎంపిటిసి వసంత, తిమ్మాపూర్ సర్పంచ్ శేఖర్, జంషెడ్ పూర్ సర్పంచ్ నూరొద్దిన్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: