కరోనా బాధితునికి బియ్యం అందజేసిన కన్యకా పరమేశ్వరి గోల్డ్ షాప్ యజమాన్యం

Published: Wednesday June 09, 2021
మధిర, జూన్ 08, ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణంలో కాలనీలో లాక్ డౌన్ కాలంలో ఏ పని దొరకక కరోనాతో బాధపడుతున్న. కారు డ్రైవర్ బుజ్జి విషయాన్ని కన్యకా పరమేశ్వరి గోల్డ్ షాప్ యజమాని  మైలవరపు వీరభద్రరావు    దృష్టికి కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీసెల్ అధ్యక్షులు దారా బాలరాజు తీసుకెళ్లగా వారు కారు డ్రైవర్ బుజ్జికి 25 kg ల బియ్యం. ఒక నెలకు సరిపోను నిత్యావసర సరుకులను వారి కుటుంబానికి ఈ రోజున అందజేసినారు. ఈ సందర్భంగా  కార్ డ్రైవర్ బుజ్జి. నా కుటుంబం ఆర్థిక పరిస్థితిని దారా బాలరాజుకు వివరించగా. వారు వెంటనే స్పందించి వీరభద్రం గారి ద్వారా నా కుటుంబానికి నిత్యావసర సరుకులు బియ్యం సహాయం చేసినందుకు నా కుటుంబం తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను