పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

Published: Saturday June 04, 2022

కోరుట్ల, జూన్ 03 (ప్రజాపాలన ప్రతినిధి ):
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా కలెక్టర్ రవి మరియు జడ్పీ ఛైర్పర్సన్ దావా వసంత లతో కలిసి  ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
మెట్ పల్లి పట్టణంలోని 6వ వార్డులో మరియు కోరుట్ల పట్టణంలోని 1వ వార్డులో 5వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కోరుట్ల పట్టణంలో  క్రీడాప్రాంగణం ను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్  దావ వసంత సురేష్, మున్సిపల్ చైర్మన్  అన్నం లావణ్య అనిల్, జిల్లా రైతు బంధు అధ్యక్షులు వెంకట్ రావు,  వైస్ చైర్మన్ పవన్ , ఆర్డిఓ వినోద్, తెరాసా నాయకులు, అధికారులు,  ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.