భవిత శ్రీ మెడికల్ స్టోర్ వార్షికోత్సవం సందర్భంగా శాంతి నిలయంలో అన్నదానం

Published: Friday April 14, 2023

బోనకల్ ఏప్రిల్ 13 ప్రజాపాలన ప్రతినిధి:వైరా మండలం రేబ్బవరం గ్రామంలోని భవిత శ్రీ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ రెండోవ వార్షికోత్సవం సందర్భంగా సిలివేరు శ్రీను దంపతుల కుమారుడు ప్రోప్రైటర్ సిలివేరు రామకృష్ణ బోనకల్ లోని మానసిక వికలాంగుల శరణాలయం శాంతి నిలయం నందు ఉన్న దివ్యంగా అనాధ పిల్లలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. సిలివేరు రామకృష్ణ చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన రెబ్బవరం గ్రామస్తులు గుత్త నాగరాజు 25 కేజీలు, గుత్త రామకృష్ణ 25 కేజీలు, పుల్లారావు, తులసి దంపతులు 50 కేజీలు మొత్తం 100 కేజీల బియ్యంను శాంతి నిలయంకు వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా సిలివేరు రామకృష్ణ మాట్లాడుతూ అనాధలు దైవ స్వరూపులని, వారికి ఒక్క పూట ఆకలని తీర్చే అవకాశం కల్గినందుకు ఎంతగానో సంతోషిస్తున్నానని అన్నారు. ఇలాంటి అనేక రకాల సేవా కార్యక్రమాలలో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, శాంతి నిలయం నిర్వాహకులు సిస్టర్ ఆల్ఫీ , సిస్టర్ బిజీలి, వాలంటీర్లు ప్రేమ, సంజన, శ్రుతి తదితరులు పాల్గొన్నారు.