సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆర్ ఎల్ ఆర్ మేడిపల్లి, డిసెంబర్ 9 (ప్రజాపాలన ప్రతిని

Published: Saturday December 10, 2022
 బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 
 ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొని మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, టీపీసీసీ ప్రతినిధి మేకల శివారెడ్డి పాల్గొన్నారు.
అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ల కల సాకారం నెరవేర్చిన తెలంగాణ తల్లి అమ్మ సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ అని ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించడం అలాగే ఈ మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన ఆర్ ఎల్ ఆర్ టీం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రక్తదానం ఒకరి ప్రాణదానం అవుతుందని రాగిడి లక్ష్మారెడ్డి కొనియాడారు.ఈ కార్యక్రమంలో
టిపిసిసి అధికార ప్రతినిధి వినోద్ ముదిరాజ్, చర్లపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ యాదగిరి, నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడల మల్లికార్జున గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ గణేష్ నాయక్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వంజరి సంతోష్, ఎయిమ్స్  చైర్మన్ షబ్బీర్ అలీ, ఉప్పల్ ఎస్సీ సెల్ చైర్మన్ హెచ్ఆర్ మోహన్, ఉప్పల్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు నరేష్, భాను గౌడ్, ఎండి రిజ్వాన్, చందు యాదవ్, చర్చ కాలనీ రాజు, కరిపె మల్లికార్జున్, శ్రావణ్, శ్రీకాంత్ నాయక్, గొల్లూరి ప్రభాకర్, రాకేష్, రియాజ్, తదితరులు పాల్గొన్నారు.