పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు
Published: Saturday June 04, 2022
మేడిపల్లి, జూన్ 3 (ప్రజాపాలన ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రామంతపూర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు మున్సిపల్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్లోని నెహ్రు నగర్లో కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి సమస్యను దశలవారీగా తీర్చుకుందామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు నోడల్ ఆఫీసర్ వెంకట రమణ, ఏఈ రాములు, ఏఈ జ్యోతి, మేనేజర్ ప్రభాకర్ రెడ్డి, మరియు జిహెచ్ఎంసి సిబ్బంది పాల్గొన్నారు. వారితో పాటు బిజెపి నాయకులు రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు బండారు వెంకట్ రావు, తాళ్ల బాల కృష్ణ, కొట్టాల బాల్రాజ్, గంట పాక మాణిక్యం , బొడ్డుపల్లి లింగం పాల్గొన్నారు.
Share this on your social network: