సిసి రోడ్డుకు శంకుస్థాపన చేసిన అశ్వాపురం జడ్పిటిసి సూది రెడ్డి సులక్షణ. అశ్వాపురం (ప్రజా పాల

Published: Tuesday November 08, 2022
 ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారామాపురం గ్రామ పంచాయతీ లో 5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో సిసి  రోడ్డును శంకుస్థాపన చేసినా...అశ్వాపురం  మండల జడ్పిటిసి సూది రెడ్డి సులక్షణ మరియు   బిఆర్ఎస్  పార్టీ నాయకులు. ఈ సందర్భంగా సూది రెడ్డి సులక్షణ మాట్లాడుతూ సంక్షేమానికి మారుపేరైనటువంటి రేగా కాంతారావు  మరియు మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచుతాయని అందులో భాగంగానే మౌఖిక కార్యక్రమాలైనటువంటి రోడ్లు తాగునీరుకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వారి ఈ సందర్భంగా చెప్పారు.

"ఈ కార్యక్రమంలో  జడ్పిటిసి  సూదిరెడ్డి సులక్షణ,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మండల  బిఆర్ఎస్  పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్,స్థానిక సర్పంచ్ చాప ఉమాదేవి,ఉప సర్పంచ్ కందుల వెంకన్న,సీనియర్ నాయకులు దైదా నారాయణరెడ్డి,సూదిరెడ్డి గోపి రెడ్డి,మండల మైనార్టీ సెల్ కమిటీ అధ్యక్షులు   నయీమ్,మిట్టకంటీ సురేందర్ రెడ్డి,కాశిమల్ల రాదకృష్ణ,గ్రామ పెద్దలు,తదితరులు పాల్గొన్నారు..