విజయపుర మార్కెట్ ను సందర్శించిన మధిర ఏఎంసీ బృందం

Published: Saturday August 27, 2022

మధిర  ఆగస్టు 26  కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర మార్కెట్ కమిటీని శుక్రవారం ఖమ్మం జిల్లా మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు అధికారులు కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా విజయపుర మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు అందిస్తున్న వివిధ రకాల సేవలు గురించి అక్కడ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మధిర మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలని లక్ష్యంతో పాలకవర్గం పనిచేస్తుందని చిత్తారి నాగేశ్వరావు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు దినేష్ కుమార్ జగదీష్ కుమార్ పాల్గొన్నారు