అరుణ గోగుల మంద సౌజన్యంతో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ
Published: Wednesday June 23, 2021
మధిర, జూన్ 22, ప్రజాపాలన ప్రతినిధి : మధిర డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు సుమారు పది వేల రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులను అరుణా గోగులమంద సామాజిక కార్యకర్త సౌజన్యంతో నిత్యావసర సరుకులను డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ చేయటం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిత్యం సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో కనీసం రెండు పూటల భోజనం కూడా తినలేని పేద ప్రజలు చాలా మంది ఉన్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని, కార్పోరేట్ దారులకు మాత్రం వేలకోట్ల దోచిపెడుతూ నిత్యావసర ధరలుపెంచి పేదప్రజలు కనీసం రెండు పూటల భోజనం చేయలేక ఆకలితో కలిడొకలతో పస్తులుంటున్నారన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీ మధిర ప్రాంతంలో ఉన్న వితంతువులకు వృద్ధులకు పంపిణీ చేయటం జరిగింది. ఇప్పటికే DYFI జిల్లా వ్యాప్తగా అనేక సేవా కార్యక్రమలు చేస్తూ,విద్యార్థి, యువజన సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తాన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వడ్రానపు మధు DYFI మండల అధ్యక్షుడు sk సైదులు, యాలజల గోపి, వంశీ, పేరు స్వామి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: